ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

గంజాయి లైన్ జీలుగుమిల్లి లైనే....!


అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జీలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వరరావు పత్రిక సమావేశం లో తెలియచేసారు, ఆదివారం జీలుగు మిల్లి పోలీస్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు,  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచారం మేరకు శనివారం జీలుగుమిల్లి చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా జంగారెడ్డిగూడెం వైపు నుండి అశ్వరావుపేట వైపు పైలెట్గా వస్తున్న కారులో ఒక బస్తా, లారీలో ఐదు బస్తాలతో రాజమండ్రి నుండి రాజస్థాన్ కి గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బుర రాము రాజమండ్రి కి చెందిన బీరక ప్రకాష్ గుజరాత్ కి చెందిన సమ అక్బర్ ఇబ్రహీం మరియు సమ జబ్బర్ రషీద్ లను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు కోసూరి సతీషు అరెస్టు చేయాల్సి ఉంది గంజాయి విలువ 12 లక్షలు ఉండగా కారు లారీ విలువ 10 లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు వీరి వద్దనుండి వాహనాల రికార్డు 4 ఆధార కార్డులు రెండు డ్రైవింగ్ లైసెన్సులు తీసుకున్నట్లు తెలిపారు ఈ అరెస్టులో సహకరించిన సిబ్బంది ఎస్ ఐ వి చంద్రశేఖర్ హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ రాజు సిబ్బంది అశోక్ కుమార్ సుధాకర్ లక్ష్మణ్ కిషోర్ ప్రవీణ్ లను రివార్డు కోసం ఏలూరు జిల్లా ఎస్పీకి సిఫార్సు చేశామని తెలిపారు.

In Association with 
 News9 

Follow us in 




Advertisement