చేపలు మరియు ఇతర నీటి అడుగున జీవులకు, రసాయనాల ప్రభావం వాటి యొక్క ప్రకృతి సహజ సిద్దమైన జీవన శైలి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది, మరి ముఖ్యముగా ప్రకృతి సహజ సిద్దముగా వాటికీ ప్రసాదించిన వాసనా పసిగట్టే లక్షణం మీద ప్రతికూల ప్రభావన్ని చూపిస్తుంది . పరిశోధకులు వివరణం ప్రకారం ఈ సున్నితమైన జలా జీవుల -కమ్యూనికేషన్ వ్యవస్థను కాలుష్య కారకాల వలన అంతరాయం కలుగుతుంది, పరిశోధకులు ప్రతికూల ప్రభావం చూపించే సూక్ష్మ మార్గాలను అధ్యయనం చేస్తున్నారు. ఎండ్రకాయల ప్రవర్తన లో మార్పులను, కిరోసిన్ కాలుష్యం యొక్క ప్రభావాలను ఒక అధ్యయనం ద్వార వారు పరిశీలించారు. రసాయనలు కమ్యూనికేషన్ వ్యవస్థ పైన అతి తక్కువ మోతాదు లో కూడా ప్రభావం చూపిస్తుందని ఒక అధ్యయనం తెలియచేపుతుంది.
రసాయన కాలుష్యం -
మురుగు మరియు వ్యవసాయ ప్రవాహాల నుండి ఔషధ వ్యర్థాల వరకు - జలధార జంతువుల ఇంద్రియాలను భయంకరమైన ప్రభావాలతో గజిబిజి చేస్తుందని, దశాబ్దాల పరిశోధనలో తేలింది. మురుగునీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించే ఒక రసాయనం కొన్ని చేప జాతుల ప్రకృతి సహజసిద్ధమైన గుణాన్ని తగ్గిస్తుంది, దీని వలన చేపలు తమ తోటి జీవులకు హాని కలిగిస్తాయి . ఔషధ-కలుషిత జలాలు చేపలపై అనేక రకాల ప్రభావాలను చూపిస్తాయి, వాటి ఆకలిని అణచివేయడం కూడా ఉంటుంది . ఒక ప్లాస్టిక్ రసాయనం ఇంద్రియాలను గందరగోళపరిచేలా చేస్తుంది, దాని సువాసన సముద్ర తాబేళ్లను ప్లాస్టిక్ చెత్తను తినేలా ఆకర్షిస్తుంది.
In Association with
News9
Follow us in