పాకిస్తాన్తో కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ ఒప్పందంపై భారత్ సంతకం చేసింది
కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ ద్వారా గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్పూర్ సందర్శించడానికి యాత్రికులను సులభతరం చేయడానికి ఈ ఒప్పందం ఉద్దేశించబడింది.అంతర్జాతీయ సరిహద్దు, డేరా బాబా నానక్లోని జీరో పాయింట్ వద్ద కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ను అమలు చేసే పద్ధతులపై భారత్ ఈ రోజు పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. సంతకం కార్యక్రమంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా, శ్రీ గురు నానక్ దేవ్జీ యొక్క 550 వ జన్మదినోత్సవాన్ని చారిత్రాత్మకంగా జరుపుకునేందుకు కేంద్ర మంత్రివర్గం 22 నవంబర్ 2018 న తీర్మానాన్ని ఆమోదించిన విషయం అందరికీ తెలిసిందే.భారతదేశం నుండి యాత్రికులు గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్పూర్ను సందర్శించడానికి, ఏడాది పొడవునా, సున్నితమైన మరియు తేలికైన పద్ధతిలో, డేరా బాబా నానక్ నుండి అంతర్జాతీయ సరిహద్దు వరకు కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ను నిర్మించడానికి మరియు అభివృద్ధి చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఈ ఒప్పందంపై సంతకం చేయడంతో, కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ యొక్క కార్యాచరణ కోసం ఒక అధికారిక చట్రం రూపొందించబడింది.
Post by