ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యక హోదా కేటాయించటం పైన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసెంబ్లీ ప్రస్తావిస్తారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనకు కట్టుబడి ఉండటం పైన ఆయన అసెంబ్లీ లో ప్రస్తావిస్తారు అనేది విశ్వసనీయమైన సమాచారం. ఆంధ్ర కి ప్రత్యేక హోదా మంజూరు పైన ముఖ్యమంత్రి ఒక రేసేల్యుషణ్ ని ప్రవేశ పెట్టె సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రత్యేక హోదా సాధిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనే చెప్పాలి. ప్రత్యేక హోదా పైన యుద్ద ప్రాతిపదికగా కాకుండా సమరస్యముగా పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తున్నాము అని జగన్ మునుపే వివరణ ఇచ్చారు.
ఏ రాష్ట్ర మద్దతు లేకుండా కేంద్రం లో ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది, ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితి లో పోరాటం కన్నా సమరస్యముగా సమస్యను పరిష్కరించుకోవాలి అనేది జగన్ మాట అది జగం ఎరిగిన సత్యం.
సమరస్యముగా ముఖ్యమంత్రి కానీ ప్రత్యేక హోదా తీసుకోని వస్తే, మునపటి ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయినట్టే అని చెప్పాలి. ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ ధర్మ పోరాట దీక్ష మిద ఖర్చు చేసిన సొమ్ము గురించి ఎద్దేవా చేసి , జవాబుదారి తనము గురించి ప్రశ్నిస్తున్నారు అలాంటిది ఏ పోరాటం లేకుండా ప్రత్యేక హోదా సాధిస్తే, చరిత్ర గుర్తు పెట్టుకునే విషయం అవుతుంది.
Post by