పండ్ల లో అక్కడక్కడ చిన్న గుంత ఏర్పడి రంధ్రముగా మారును. అందులో తిన్న ఆహార పదార్దములు ఇర్రుక్కొని కుళ్ళుట వలన పన్ను నొప్పి, చిగుళ్ళ వాపు వచ్చును. దీనినే పిప్పి పన్ను అంటారు.
చిట్కాలు :
1.పన్నులలో ఏర్పడిన గుంతలో ఇంగువ ను ముద్దా చేసి ఉంచిన నొప్పి తగ్గును
2.లవంగాలు నూనెను పత్తికి అద్ది, పంటిలో ఏర్పడిన రంధ్రములో పెట్టిన నొప్పి తగ్గును.
౩.పత్తి గింజలు కాల్చి మసి చేసి, అ మసి చే పళ్ళు తోముకున్న నొప్పి తగ్గును. నొప్పి తగ్గటమే కాకుండా గుంతలు పడటం కూడా తగ్గును.
4. వారానికి ఒక్కసారి అయిన వేప లేక తుమ్మ పుల్లతో పళ్ళు తోముకోవాలి.
Post by