ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

రైతు ద్రోహి - చింతలపూడి మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షుడు - చెరువులు పూడ్చే పని లో తన పూర్తి పరపతి ని వాడుతున్న గుత్త వెంకటేశ్వరరావు



       

సాక్ష్యం ఇదిగోండి

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం, శివాపురం గ్రామము శివారులో మొండికుంట చెరువు మీద ఆధారపడి  కొని రైతు కుటుంబాలు దశాబ్దాలు తరపడి వ్యవసాయం సాగు చేస్తున్నాయి. అయితే స్థానికంగా ఉన్న ఒక వ్యక్తీ రాజకీయంగా అతనికున్న పలుకుపడిని ఉపయోగించి , ఈ చెరువుని పూడ్చాలి రైతుల కడుపు కొట్టాలి  అనే పైశాచిక ఆలోచనతో  తన పలుకుబడిని ఉపయోగించి,  కరువు పనులు అని చెప్పి కూలి వారిని అతని పైశచిక రాజకీయ ఎత్తుగేడ క్రింద   వాడుకుంటున్నాడు. అయితే ఇందుకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా వత్తాసు పలకడం అ రాజకీయ నాయకుడి, రైతు పొట్ట కొట్టాలి అనే ఆలోచనకి అర్జ్యం పోసినట్టు అవ్వుతుంది.
మేము చెప్పే రాజకియనాయకుడు స్థానికంగా ఎన్నడు ఎన్నికలలో గెలిచింది లేదు. అతని బంధువులు ఉన్న చోటు నుంచి పోటి చేసి, ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా, చింతలపూడి మండలం , శివాపురం లో స్థిర నివాసం ఏర్పరచుకొని స్థానికంగా అతనికి వ్యక్తిగతంగా ఎవరి మీద అయితే పగ పెంచుకుంటడో వారి మీద ఈ విధముగా పగ సాధిస్తుంటాడు. అతని వ్యక్తిగతంగా   ఈ రైతు కుటుంభాలతో ఏమి వైరామ్ ఉందో తెలియదు కానీ, ఇతను మాత్రం గత సంవత్యరం అనగా 2017 సంవత్యరం నుంచి ఈ మొండికుంట చెరువుని పూడ్చాలి అని విశ్వప్రయత్నం చేసాడు అయితే అప్పటిలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి జోక్యం తో ఈ విషయం సద్దుమణిగింది. అప్పటి తరువాత  ఈ రాజకీయ పైశాచకుడి  యొక్క ఉన్మాద చర్యలు మరింత శ్రుతిమించి పోయి అహర్నిశలు ఈ చెరువు ఆధారిత రైతుల యొక్క పొట్ట ఎలాగా కొట్టాలి అనే విషయం పైన ఆలోచనలు సందించాడు. ఇప్పుడు కరువు పనుల రూపములో, అవసరమైతే రాజకీయ నాయకుల చెప్పింది వేధం గా భావించే పని చేసే ఫీల్డ్ అసిస్టెంట్ అప్పారావు లాంటి  ఉద్యోగులను ఎరగా వేసి అమాయక కార్మికులను వాడుకొని చెరువు పుడికలు తియ్యించే పని అని చెప్పి చెరువు ని పుడ్పించే పనికి పూనుకున్న రైతు ద్రోహి వాస్తవ గాధ ఇది .
 సుమారు వంద ఎకరులు వరుకు ఈ మొండికుంటా చెరువు నిటి మీద ఆధారపడి రైతులు సాగు చేసుకుంటున్నారు. నిరు చెట్టు పధకం ప్రభుత్వం పరిచయం చేసిందే వ్యవసాయ భూమి  యొక్క సాగు ప్రయోజనాలు కోసం.  చెరువులో ఉన్న పూడికలు తీసి అ చెరువు ని జలవనరు కింద తీర్చిదిద్దాలి అనే ఆలోచనతో అధినాయకుడు ఈ ప్రణాళిక సిద్దం చేసారు.  కానీ ఇక్కడ జరిగేది ఏమిటి అంటే చెరువు కట్టకు వాలు గా లోపలకి,  తవ్విన మట్టిని వెయ్యమని చెప్పిన ఈ "ఎంకులు" గారి ఆలోచన  వెనక అద్బుతమైన పైశాచిక ఆలోచన ఏమిటి అంటే వర్ష కలం లో మట్టి జారి ఒడ్డు అవుతుంది, అలాగా నాలుగు సంవత్యరాలు చేస్తే చెరువు సగం బుడుకుంటుంది, రైతులకి సరైన సమయానికి నిరు అందదు, అప్పుడు వీరి కంట తడి చూసి ఇతను పైశచిక ఆనందం పొందలి - అని అనుకోవాలా వద్ద అనే విషయం మీకే వదిలేస్తున్నాము.
సరే ఇక్కడ పనిచేసి ఫీల్డ్ అసిస్టెంట్ కి మేము కాల్ చేస్తే అయన చెప్పింది ఏమిటి అంటే-"మాకు కట్ట వెయ్యమని ఎటువంటి ఉత్తర్వులు లేవు కానీ ఇక్కడ స్థానికి రైతులు మమ్మల్ని అడిగారు అని చెప్పారు అయన " రైతులు పేరు తను చెప్పలేను అని వారిలో కొంతమంది ఈ చేరువులోనే పని చేస్తున్నారు అని. కానీ అక్కడ రైతులను మేము అడుగగా, వారు చెరువు కట్ట  సరిపడా ఉంది అని "ఎంకుల " గారి పన్నాగం భయటపెట్టారు. అక్కడ స్థానికి కార్మికుడిని మేము ప్రశ్నించగా " ఎంకులు " గారు ఇలాగ చెయ్యమని చెప్పారు అని  నిష్కల్మష మైన మాటలతో అతనే చెప్పాడు. సదరు ప్రాజెక్ట్ AO గారికి ఫోన్ చేసి అడుగగా "నా పని వారికీ కరువు పని చూపించడం మాత్రమే, వాళ్ళు మట్టి ఎక్కడ పోసిన నాకు అనవసరం. కావలసివస్తే ఏం డి ఓ తో మాట్లాడుకోండి " అని చెప్పారు .

ఇక్కడ జరిగే విషయం పైన స్థానిక రైతు మూడు రోజుల క్రిందట ఏం డి ఓ గారికి ఫిర్యాదు చేసారు. మరి రాజకీయ నాయకులకి గులాం అయ్యో లేక నిర్లక్ష్యమో తెలియదు కానీ ఇప్పటి వారుకు ఎటువంటి చర్యలు లెవ్వు. మూడు రోజుల తరువాత మేము వచ్చి పరిసిలిస్తాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తున్నారు. 1100 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు లెవ్వు .
అసలు కరువు పనులు అంటే రాజకీయ నాయకుడి పర్యవేక్షణ లో జరుగుతాయ లేదా ప్రాజెక్ట్ మేనేజర్ పర్యవేక్షణ లో జరుగుతాయ అనే విషయం ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్ధం అవ్వుతుంది అవినీతి ఏ స్థాయి లో జరుగుతుందో.
పదవి ని అడ్డుపెట్టుకొని పైసలు సంపాదించే నాయకులనే చూసాము కానీ - పైశాచిక ఆనందం పొందే రాజకీయ ఉన్మాది ని చూడటం, అది రైతు కడుపు కొట్టాలి అని ఆలోచించే రాజకీయ కీచకుడు ఇతను అని అనుకోవాలా లేదా అనే ఆలోచన మీకే వదిలేస్తున్నాము .
 రాజకీయ నాయకుల కి గులాం అయ్యే ఉద్యోగులు అది మండల స్థాయి లో బాధ్యత గల ఉద్యోగం లో ఉండి ఏ రాజకీయ ప్రలోభాలకి లోబడి ఇంతటి నీతి తక్కువ పని కి పలుపడుతున్నారో అనే ఆలోచన కూడా పాఠకులకే  వదిలేస్తున్నాం .అసలు ఈ సాక్ష్యాలు అన్ని చూస్తే కరువు పనులు అని చెప్పి కార్మికులను మోసం చేసి తమ వ్యక్తిగత పనులకు ఉపయోగించుకుంటున్నారు అని చెప్పటానికి ఏమాత్రం ఆలోచించనవసరం లేదు. ఇక్కడ బలహీన వర్గాన్ని , కార్మిక వర్గాన్ని ఒక కీచక రాజకీయనాయకుడు తన స్వప్రయోజననికి ఎలాగా వాడుకుంటున్నాడు అనే విషయం మనకి అర్ధమవుతున్నది. అయితే ఇతను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినవాడే మరి ఇలాగ చేస్తున్నాడు అంటే అతను తినేది ఏమిటో అతనికే తెలియాలి.

ఫీల్డ్ అసిస్టెంట్ అప్పారావు  గారు చెప్పిన వివరాలు ప్రకారం కరువు పనులలో అప్పగించిన పనులు మానేసి అక్కడ స్థానికంగా ఎవరు అయిన పని చేసి పెట్టమంటే విరు ఏ మాత్రం ఆలోచించకుండా వాళ్ళకి ప్రభుత్వం తరుపున చెయ్యవలిసిన  కరువు పనులను పక్కన పెట్టి, కార్మికులను వేరే పనులకు వాడుతున్నారు బిల్లులు, మాత్రం చెయ్యని పనికి మంజూరు చేయిస్తున్నారు అనే విషయం స్పష్టం గా అర్ధమవ్వుతుంది. అంటే ప్రభుత్వ సొమ్ములు  దోచుకుంటున్నారు అనేకద దిని అర్ధం . AO శ్రీనివాస్ గారు చాల స్పష్టంగా చెప్పారు మా పని కరువు పనులు చూపించడం వరుకే  వాళ్ళు ఎలాంటి పని చేసిన మాకు అనవసరం అని సర్ అంత బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారు, సర్ ఉద్దేశం ప్రకారం అక్కడ ఏమి పని చెయ్యకపోయినా పని చూపించి , దొర గారు  ఇంట్లో నో లేదా ఎక్కడ అయిన హోటల్ లో కూర్చొని ముచ్చట్లు పెట్టిన చాలు.  అంటే చింతలపూడి నియోజకవర్గం లో కరువు పనులు అని చెప్పి కార్మికులను ప్రతి పనికి వాడేస్తున్నారు అనే విషయం ఇక్కడ స్పష్టం అవ్వుతుంది.
చివరిగా ఒక మాట రైతు కన్ను యెర్ర చేస్తే తినటానికి తిండి కూడా లేక చస్తాము - అదే రైతు కడుపు కొట్టాలి అనే ఆలోచన వస్తే సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది .
టేక్నికల్ అసిస్టెంట్ చెరువు పుడ్చావద్దు అని  చెప్పిన అతని మాట ఖాతరు చెయ్యకుండా ఫీల్డ్ అసిస్టెంట్ రాజకీయ ప్రాలోభాలకి లోపడి చెరువు పూడ్చే ప్రయత్నం ముమ్మరం చేసాడు . మరి సదరు "ఎంకులు " అంతగా రుచించేలాగా ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అప్పారావు గారికి ఏమి పెట్టారో తెలియదు .
టెక్నికల్ అసిస్టెంట్  ఫీల్డ్ మీదకి వచ్చి సదరు ఫీల్డ్ అసిస్టెంట్ కి ఫోన్ చేసిన ఫీల్డ్ మీదకి రాలేదు, అయితే   ఇంటికి వెళ్లి అడుగగా మొండికుంట చెరువు దగ్గెర ఉన్నను అని చెప్పించాడు . ఒక రిపోర్టర్ మెసేజ్ పెడితే సారీ సర్ మా ఇంట్లో ఒకరికి ఒంట్లో బాగోలేదు ఆసుపత్రి కి తిసుకువెళ్ళను అని మెసేజ్ పంపించాడు.
ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఎంతటి రాజకీయ ఉడిగం చేస్తున్నాడు అంటే , ఒక ట్రాక్టర్ ని పురమాయించి దానిని లైసెన్స్ లేని ఒక మహిళ తో తోలించి, అది తాటి చెట్టుకి వాలు గా ఆనించి వీడియో తిసుతున్నాడు, ఎందుకు అనుకుంటున్నారా ? "ఎంకులు " గారు చెప్పారు కదా .....అక్కడ ట్రాక్టర్ వెళ్ళటానికి లేదు అని పై ఆఫీసర్ కి చూపించడానికి (ఈ చిత్రాలు మా ఫోన్ లో చిత్రికరించము ). "ఎంకులు " కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి చెరువు కట్ట లోపలకి మట్టి పోయించేందుకు ఒక ఆఫీసర్ ని పర్మిషన్ ఇవ్వమని వత్తిడి చేస్తే రైతు బాధ తెలిసిన సదరు ఆఫీసర్ నిర్మొహమాటంగా నిరాకరించారు అని తెలిసింది. మీడియా వారు వస్తున్నరు అనే  విషయం తెలుసుకున్న అవినీతి నాయకుడు ఉరు నుంచి భయటకి జారుకొని చెయ్యలనుకున్న రాజకీయo ఇది.
టెక్నికల్ అసిస్టెంట్  రైతులు ఫిర్యాదు అందించిన వెంటనే ఫోన్ చేసి  ఫీల్డ్ అసిస్టెంట్ కి మట్టి చెరువుకట్ట లోపలికి పోయవద్దు అని చెప్పిన అతను ఏ మాత్రము పట్టించుకోకుండా  అ తరువాత రోజునుంచి ఇంకా పొయ్యడం, అది టేక్నికాల్ అసిస్టెంట్ వచ్చి ఫీల్డ్ నుంచి ఫీల్డ్ ఆఫీసర్ కి  ఫోన్ చేసిన స్పందించకుండా, ఫోన్ లు ఎత్తకుండా అతని ఇష్టం వచ్చినట్టు చేయట్టంలో అతనికి రాజకీయ భలం ఎంత ఉందో తెలుస్తుంది . నీతి గా పనిచేస్తాను అని చెప్పిన టెక్నికల్ అసిస్టెంట్ మనోభావాలు దెబ్బతినేలగా మాట్లాడిన ఏం డి ఓ, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏమన్నారు అంటే నువ్వు ప్రభుత్వం  చెప్పినట్టు చెయ్యాలి ఇక్కడ ప్రభుత్వం అంటే దొరగారి దృష్టిలో "ఎంకులు " గారు .
వారి మాట విననందుకు పాపం టెక్నికల్ అసిస్టెంట్ గారి మిధ చాలానే గుర్రు  పెంచుకున్నారు.
"ఎంకులు" గారిని ఈ విషయం పైన వివరణ ఇవ్వమని ఒక రిపోర్టర్ ఫోన్ చేస్తే "వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం లో పర్మిషన్ తెచ్చుకొని కట్ట పోసుకున్నారు (వాళ్ళు అంటే రైతులు అని అర్ధం - ). ఒక్క రైతు మాత్రమే అడ్డుకుంటున్నాడు  అని చెప్పుతున్నాడు. అప్పటిలో కట్ట పోయ్యటానికి  400 తీసుకున్నారు అని చెప్పుతున్నారు " . " మరి అ రోజు మీరు పైన అధికారులకి ఫిర్యాదు ఎందుకు చెయ్యలేదు అని అడిగితే " రైతుల మంచి కోసం కదా, అయిన వాళ్ళు చేస్తే తప్పు కాదు నేను చేస్తే తప్ప అని " రిపోర్టర్ నే బెదిరించే స్థాయి కి "ఎంకులు " గారి నెత్తి మీద పెంక్కు పెరిగింది. (మేము ఎక్కడ ఎడిట్ చెయ్యకుండా ఈ ఆడియో క్లిప్ కూడా ప్రచురిస్తున్నాం ) . మొత్తానికి "ఎంకులు " గారి మనోభావం మాత్రం అప్పటిలో రైతులు కట్ట పోసుకోవడానికి లేని అభ్యంతరం ఇప్పుడు నేను చెరువు పుడ్పిస్తాను అంటే వచ్చిందా ? అని అనుకోవాలా లేదా అనే విషయం మీకే వదిలేస్తున్నాము .
"ఎంకులు " గారు చెప్పిన ఇంకొక విషయం ఏమిటి అంటే " అక్కడ రైతులు చెరువు కట్ట పెంచమని చెప్పారు అని "
ఇక్కడ రైతులు మేము కట్ట వెడల్పు చెయ్యమని ఎవరికి  చెప్పలేదు, అని మేము చెప్పటం కాదు వారు స్వహస్తాలతో వారె మాకు వ్రాసిఇచ్చిన నోట్ కూడా ప్రచురిస్తున్నాం. 
ఇంకా    నా వెనుక దేవినేని ఉమా ఉన్నారు నేను అక్కడ నుంచే ఫోన్ చేస్తున్న , చెరువు పుడ్పించటానికి పర్మిషన్ తీసుకోని వస్తున్న అని ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరిస్తున్నారు "ఎంకులు " అనే సమాచారం కూడా మాకు అందింది. మరి ఉమా గారి మీద బురద చల్లటనికో లేద ఇతను  ఆంధ్రకలువ లో చేసిన అక్రమము గురించి జనాలకి తెలిసింది కబ్బటి నాకు ఇంత పలుకుబడి ఉంది చూపించటనీకో ఈ ప్రయత్నం. "ఎంకులు" గారు ఈ విషయాన్ని ప్రేస్టిజి ఇష్యూ కింద తీసుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. 
-దుర్మార్గుడి ఆలోచనలు భట్టబయాలు చెయ్యటానికి ఒక్క రోజు ఆలస్యం చేసిన దాని మూల్యం ఎన్నో రోజులు భరించాలి - www.quickandhra.com independent web media publication.
సాక్ష్యాలు ఇంకోచము సేపటిలో ప్రచురిస్తాము

 ఫీల్డ్ అసిస్టెంట్ ని కట్టవేయ్యమని అడిగితే వారు పోయిస్తున్నాము అని ఆయనే చెప్పారు ఇక్కడ కొంత మంది వ్యవసాయ దారులు స్టేట్ మెంట్ లు ఇవిగోండి



తరువాత ఆర్టికల్ లో ఇక్కడ స్థానికంగా ఒక నాయకుడు  పని చెయ్యకుండా పని చేశాను  అని చెప్పి డబ్బులు నొక్కి మళ్ళి  అవి తిరిగి  కట్టిన విషయం తెలిసింది అ వివరులు సేకరించే పనిలో ఉన్నాము . త్వరలో ....అతి త్వరలో ....మళ్ళి వస్తాము ......







 Post by

 Quickandhra Independent Web Media Publication

Advertisement