కథానాయిక రష్మిక బాలీవుడ్లో నటించిన తొలి చిత్రం 'గుడ్ బై'. ఈ సినిమాలో ఆమె ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చనక్కు కూతురుగా నటించింది. ఆయనతో కలిసి నటించడంపై రష్మీక ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. అమితాబ్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా మొదటి సినిమా. మొదటి సినిమానే ఇంత పెద్ద సూపర్స్టార్తో చేయడం ఆనందంగా ఉంది" అని అన్నారు. వెంటనే పక్కనే ఉన్న అమితాబ్ ఆమె మాటలకు "నాకు కూడా మీలాగే ఉంది" అంటూ రిప్లై ఇచ్చారు. అమితాబ్ తో రష్మిక తనకున్న అభిమానాన్ని తెలపడం ఇదే మొదటిసారి కాదు. 'గుడ్ బై' ట్రైలర్ లాంచ్లోనూ రష్మిక మొదటిసారి అమితాబ్న కలిసినప్పుడు కలిగిన అనుభవాన్ని పంచుకుంది.
వికాస్ బహల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నీనా గుప్త, సాహిల్ మెహతా, శివిన్ నారంగ్ ప్రధాన పాత్రలు పోషించారు. అక్టోబర్ 7న ఈ సినిమా ప్రేక్షుకులను పలకరించనుంది.
In Association with
News9
Follow us in