నవంబర్ 20-21 తేదీలలో లక్నోలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో జరిగే 56వ DGP కాన్ఫరెన్స్లో పాలుగుంటున్న ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2021 నవంబర్ 20-21 తేదీలలో లక్నోలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ (DGP) మరియు ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ (IGP) 56వ కాన్ఫరెన్స్కు హాజరవుతారు.
రెండు రోజుల సదస్సు హైబ్రిడ్ పద్ధతిలో జరగనుంది. రాష్ట్రాలు/యుటిల డిజిపి మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ మరియు సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ల అధిపతులు లక్నోలోని వేదిక వద్ద స్వయముగా కాన్ఫరెన్స్కు హాజరవుతారు, మిగిలిన ఆహ్వానితులు IB/SIB ప్రధాన కార్యాలయంలోని 37 వేర్వేరు ప్రదేశాల నుండి వర్చువల్గా పాల్గొంటారు. సైబర్ క్రైమ్, డేటా గవర్నెన్స్, కౌంటర్ టెర్రరిజం సవాళ్లు, వామపక్ష తీవ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో ఎమర్జింగ్ ట్రెండ్స్, జైలు సంస్కరణలు వంటి అనేక అంశాలపై ఈ సదస్సు చర్చిస్తుంది.
In Association with