పోలవరం నిధులకు ప్రత్యేక హోదా వస్తుందా? విభజన చట్టాల లో హామీల పైన మన ఎంపీలు పోరాటం చేస్తారా? కేంద్రంపై పోరుకు జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా?
- పోలవరం నిధులకు ప్రత్యేక హోదా వస్తుందా?
- విభజన చట్టాల లో హామీల పైన మన ఎంపీలు పోరాటం చేస్తారా?
- కేంద్రంపై పోరుకు జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా?
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం అవుతున్నవి. అయితే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపీలతో సమావేశమయ్యారు, పార్లమెంట్లో ఎటువంటి చిన్న అవకాశం దొరికినా పోలవరం ప్రాజెక్టు బకాయిలు 3223 కోట్ల రూపాయలు గురించి మరియు అర్ అండ్ అర్ కోసం 10 వేల కోట్లు విడుదల చేసే లాగా వాటిని ప్రధానాంశాలుగా చర్చనీయాంశంగా చర్చలోకి తీసుకొని రావాలని చెప్పి జగన్ నిర్దేశించారు.
రాజకీయాలు
అలాగే రాష్ట్ర అ రెవెన్యూ లోటు 18969 కోట్లు గురించి కూడా చర్చ జరపాలని జగన్ ఎంపీల కి సూచించినట్టు విశ్వసనీయమైన సమాచారం.
అయితే ఈ అంశం లేవనెత్తినప్పుడు కేంద్రం ఏలాగే స్పందిస్తుంది అనేది చర్చనీయాంశం అయ్యింది. ఆంధ్ర రాష్ట్రానికి మొండి చెయ్య చూపించటమే ఎజెండాగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం పైన పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు గళమెత్తితే ఏ విధంగా స్పందిస్తుంది అనేది ప్రశ్నార్థకమే?
ఆర్టికల్స్
కేంద్ర ప్రభుత్వం పైన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పోరుకు సిద్దమేనా?
విన్నపానికి, నిందించడానికి ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ ఈ రెండింటిలో ఏ దారిని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకుంటుంది ది అనేది చర్చనీయాంశం.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వన్ పోరుబాట పడుతుందా లేదా సామరస్యంగా కావలసింది అడిగి సాధించుకుంటుందా అనేది ఈనెల 18 వ తారీఖున తెలుస్తుంది.