ఫేక్ అకౌంట్స్ సోషల్ మీడియా లో హల్చల్ చెయ్యడం అందరికి తెలిసిందే- అయితే ఈ సోషల్ మీడియా ప్రభావం ఇప్పుడు ప్రజల మీద పడటం, అ ప్రభావం దేశ రాజకీయాల మీద పడుతుంది అని గుర్తించిన ఫేస్ బుక్ సంస్థ ఈ విషయాన్ని కొంత సీరియస్ గా పరిగణించింది. ఎన్నికలు రానున్న సమయములో వారు ఒక ప్రకటన విడుదల చేసారు.
ఫేస్ బుక్ లో చేసే ప్రకటనలలో వాస్తవికతను గుర్తించే పని లో నిపుణులను నియమితం చేస్తున్నాం అని రిచర్డ్ అలాన్ తెలియచేసారు. ఫేస్ బుక్ డేటా ని రాజకీయ పలుకుపడి తో కొంత మంది దుర్వినియోగం పరుస్తున్నారు. అలాగే దేశం లో ఉన్న రాజకీయ పార్టీల తో కలిసి పని చెయ్యటానికి వారు సిద్దం గా ఉన్నారు అని తెలియచేసారు.
పూర్వం అమెరికా ఎన్నికలు జరిగినప్పుడు రష్యా నుంచి కొన్ని ఫేక్ ఎకౌంటు లు, పేజి లు ఉనికోలోకి వచ్చి అమెరికా దేశం ఎన్నికల లో రష్యా నుంచి ప్రకటనలు చేసి ప్రభావితం చేయ్యపడ్డవి అనే అభియోగాలు లేకపోలేదు. ఇందుకుగాను ఫేస్ బుక్ సంస్థ ప్రత్యేకముగా నిపుణులను నియమించి, ఇటువంటి చర్యలు జరగుండా నియంత్రించటానికి సన్నాహాలకు సిద్దం అవుతుంది. ఎన్నికలు దగ్గిర పడిన తరుణంలో ఈ బృందాలని రంగంలోకి దించుతారు అనేది వినికిడి.
Post by