బాక్స్ ఎట్ తవ్వకాలు చేస్తున్నారు అని అందుకు సమర్దిస్తున్నారు అని చెప్పి ఇద్దరినీ చంపేసిన విషయం ఇప్పుడు రాష్ట్రం లో చర్చనీయమైన అంశం గా మారింది. ప్రస్తుత సమాజం లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆలోచన శక్తి అందరిలో పెంపొందింది. నిజంగా చెప్పాలి అంటే టెక్నాలజీ పెరిగింది, ఏ ఒక్క విషయం దాగటం లేదు. అక్షరాస్యత పెరిగింది. భయపెడితే మరే పరిస్థితులు ఈనాడు లెవ్వు. ప్రజలలో చైతన్యం రావాలి అదే నిజమైన ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం ముఖ్య ఉద్దేశం కూడా అదే.
అడవుల లో నిజమైన మృగాలు లెవ్వు అక్కడ ఆకలేస్తేనే వేట ఇక్కడ ఆకలి తిరినతరువత కూడా వేట ఉంటుంది. ఒక మనిషి ని చంపితే అతని పైన సానుభూతి వస్తుంది తప్ప ఎందుకు చంపారు అనే విషయం ఆలోచించే స్థాయి లో నేటి సమాజం లేదు. సమస్య ఇది అని ప్రజలకి తెలియాలి. బల ప్రయోగాలికి వెళ్ళితే రాష్ట్ర బలం ముందల ఎటువంటి శక్తి నిలపడలేదు.
భావాలూ వ్యక్త పరిస్తే స్పందించే గుణం మనిషికి ఉంది. నిజంగా అక్కడ అన్యాయం జరిగితే స్పందించటానికి న్యాయవ్యవస్థ ఒకటి ఉంది. అందుకు ఉదాహరణగా చాల విషయాలలో స్పందించిన విషయాలు కూడా ఉన్నాయి. నిజమైన సమస్యలు సమాజం లో ఉన్నాయి కానీ సమాజం హింస ధోరణి తో ఎకిభావించదు, మార్పు కోరుకునేవారు సమాజం లో ఉన్నారు కానీ ఈ రకముగా కాదు.
మార్పు మార్పుని తీసుకోని వస్తుంది , భయం భయాన్ని తీసుకోని వస్తుంది. భయం తాత్కాలికం, మార్పు శాశ్వతం. ఒక వేళా ఉద్దేశం ప్రక్షాళన అయితే అది ఈ హింస తో కుదరదు. ఇప్పుడు అక్కడ వారి ప్రాణాలు తీసి ఏమి జరపకుండా ఆపాలి అనుకుంటే అది ఖచ్చితంగా జరిగే విషయం కాదు - ప్రజల్లో చైతన్యం రాకుండా ఎంత మందిని చంపిన - యెంత హింస చేసిన జరిగేది ఆపటం కష్టం. ఒక వక్త కి ఒక అక్షరానికి మాత్రమే ఈ ప్రజాస్వామ్యం లో అ అవకాశం ఉంది.
Post by