ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

చింతలపూడి మండలం లో మల్లయిగూడెం లో 5000 తీసుకున్న అధికారిని నిలతిసిన.....?



     

అవినీతి పేరుకుపోయిన అధికారయంత్రంగం, ప్రభుత్వం ప్రజలకి లబ్ది చేకురుద్దము అని నిర్ణయించుకున్న అది తీరని కోరిక గా మిగిలి పోయే విధముగా కొన్ని సంఘటనలు, మాయని  మచ్చ లాగ మిగిలిపోయే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నవి. సమస్యలు తెలుసుకుంటున్న నాయకులకు దిమ్మ తిరిగే నిజాలు తెలిసిన  ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి. రూ. 5000 తీసుకోని పని చెయ్యలేదు అని, అదే విధముగా చాల మంది దగ్గెర కూడా డబ్బులు తీసుకోని ఉన్నారు, కానీ పని చెయ్యలేదని, అక్కడ ఉన్న ఒక అధికారి పైన  (సాక్ష్యాలు ఉన్నా అంశం రాజకీయ చర్చ అవ్వకుడదు అని ప్రచురించటం లేదు)  చింతలపూడి మండలం లో మల్లయిగూడెం  గ్రామం లోని పాలక పార్టీ  కార్యకర్త ఆరోపణలు చేసారు.


ఒక అధికారి నిజంగా డబ్బులు ఆశించకుండా పార్టీ ల ప్రస్థావన ప్రక్కన పెట్టి లబ్ది దారులకు లబ్ది చేకురిస్తే  ఎవరి మీద వ్యతిరేకత ఉండదు. ఈ విషయాన్నే స్థానిక ఏం పి డి ఓ ఒక మీటింగ్ లో ప్రస్తావించి సూచనలు ఇచ్చారు. కానీ ఎవరి ప్రోత్యహమో తెలియదు కానీ అవినీతి కి మాత్రం అడ్డు అదుపు లేకుండా పోయింది.     

ఒక అధికారి నిర్లక్ష్యం , లేదా వారి  అత్యాశ ప్రభావం  పాలక పార్టీ మిదే పడే అవకాశం ఎక్కువ ఎందుకంటె  ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ లబ్ది, లబ్దిదారులకు నేరుగా చేరాలి అని,  కానీ ఇక్కడ చెయ్య తడిపితే కానీ పని జరగటం లేదు అని కొంత మంది స్థానిక నాయకుల ముందే అధికారులను నిలతియ్యటం జరుగుతుంది. ఇది పాలక పార్టీ కార్యకర్త గోషా !  ఇంకా వేరొక పార్టీ ముద్రపడిన  వారి గోషా వినే వారు ఎవ్వరు ?

 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement