రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యం రాజ్యాంగం ఇచ్చిన అధికారం. మనం ఇక్కడ ఎన్ని ప్రశంగాలు చేసిన చివరికి పని జరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి, కరుణ తప్పదు. భారత రాజ్యాంగం షెడ్యూల్ 7 లో ఈ విషయాలు పొందుపరిచారు. ఇందులో 97 అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకముగా ఉన్నవి అలాగే కంక్యురెంట్ లిస్టు III లో 47 విషయాల పైన చట్టం చెయ్యగల అధికారం ఉంది.
ఇందులో కొన్ని విషయాలు మనము చర్చలోకి తీసుకోని వస్తే బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అదుపులో నే ఉంటాయి. అంటే రాష్ట్రానికి ఆర్ధిక సహాయం చెయ్యాలి అంటే రాష్ట్రం తరుపున కేంద్రం వేరొక దేశానకి అర్జి పెట్టాలి, మళ్ళి అ తీసుకున్న ఋణాన్ని కి వడ్డీ కేంద్రానికి చెల్లించాలి, కేంద్రం "నో " అంటే చేసేది ఏమి లేదు.
ఇంకా రవాణా వ్యవస్థ మీద కూడా కేంద్రానిదే అధిపత్యం, అంతరాజతియ వ్యాపార లవాదేవిలు చెయ్యాలి అన్న, వాణిజ్య వ్యవహారాలు చెయ్యాలి అన్న కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలి. ముడిచమురు మీద కూడా కేంద్రానిదే ఆధిపత్యం, నది ప్రవాహాల పైన కూడా కేంద్ర ప్రభుత్వానిదే ఆధిపత్యం, జి ఎస్ టి దెబ్బ తో రాష్ట్ర ఆదాయానికి ఘండి. ఈ సమయం లో ప్రాంతీయ ప్రభుత్వానికి కి ఆదాయం ఎక్కడనుంచి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తో లాలుచి పడకుండా ఎన్ని రోజులు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యగలవు? ప్రాంతీయ పార్టీల మనుగడ యెంత వరుకు సాధ్యం!
Post by