తాటిపాక - లాంకో సెక్టార్ లో జరిగిన ప్రమాదం వలన గ్యాస్ సప్లై చెయ్యలేకపోవటం వలన ఓ ఎన్ జి సి కి రోజుకి 13 కోట్ల నష్టం. ఈ విషయం పైన ఒక నివేదిక తాయారు చెయ్యమని ఓ ఎన్ జి సి ఏం /స్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా వారిని కోరింది, వారు సదరు విషయం పైన ఒక నివేదిక తాయారు చేసి ఇచ్చారు. వారి నివేదిక లో ప్రతి యూనిట్ కి డ్రైయర్స్ మరియు చిల్లర్స్ ని అమర్చవలిసిందిగా సలహా ఇచ్చారు.గెయిల్ మరియు ఓ ఎన్ జి సి మధ్య జరిగిన సమావేశం లో ఒక నిర్ణయం తీసుకున్నారు అది ఏమిటి అంటే అంత సరి చేసేవరుకు తాత్కాలిక ఏర్పాటు లు సిద్దం చెయ్యాలి అని. కమిటి కూడా నిర్జలికర సదుపాయం (dehydration Facilities) కోసం సమాంతర చర్యలకు ఆమోదం తెలిపింది.
24-01-2014 పి ఏ సర్కులర్ ప్రకారం అరుణ్ రత్నదాస్ డి జి ఏం అందుకు సంభందించిన ఫసె 1 కి కావలిసిన 5 యూనిట్స్ కోసం ఒక కొటేషన్ తాయారు చేసారు, కానీ అసలు అ సర్కులర్ ప్రకారం 3 బడ్జెట్ల కొటేషన్ తాయారు చెయ్యాలి. ఇందుకుగాను ఏం/ఎస్ దీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే ఒకే ఒక్క కంపెనీ దగ్గెర నుంచి కొటేషన్ వచ్చింది . ఈ కొటేషని 219 కోట్ల రూపాయలకు అశోక్ వర్మ అప్పటి డైరెక్టర్ (ఆన్ షోర్ ) ఆమోదించారు, అశోక వర్మ గారి ఆమోద పరిమితి 200 కోట్ల రూపాయలు మాత్రమే కానీ అయన పరిమితి కి మించి 219 కోట్లకి ఆమోదాన తెలిపారు.
12-12-2014 వ తేదిన ఓ ఎన్ జి సి వారు ఈ టెండర్లు ప్రకటన చేసారు. కాంట్రాక్టు చెయ్యడానికి నిర్ణిత అర్హత లేకపోయినా, అనుభవం గురించి ఎటువంటి సర్టిఫికేట్ పొండుపరచాకపోయిన టెండర్ కమిటి ఏం/ఎస్ దీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి ఆమోదం తెలిపారు .
బిడ్దర్ బీడ్ చేసిన బీడ్ నిర్ణయ పరిమాణాల ప్రకారం తిరస్కరించాపడలి, ఎందుకంటె బీడ్ వేల్యూ కన్నా 1.5% ఎక్కువ బీడ్ చేసాడు. ఓ ఎన్ జి సి టెండర్ కమిటి ఇవి ఏమి పట్టించుకోలేదు.
ఇలాగె ఏం/ఎస్ దీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి మాత్రమే కాంట్రాక్టు లు ఇచ్చి ఓ ఎన్ జి సి కి 80 కోట్ల రూపాయలు నష్టం వచ్చే విధముగా సిబ్బంది వ్యవహరించటం పైన 18-04-2018 వ తేదిన శ్రీ ఎస్. సురేష్ కుమార్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఓ ఎన్ జి సి (విజిలెన్స్) వారు సి బి ఐ కి ఫిర్యాదు చేసారు.
మా ప్రేక్షకులు కోసం ఎఫ్ ఐ అర్ కాపీ పొందుపరుస్తున్నాం