అసలు భూమి హక్కు దారుల పాస్ పుస్తకాల కి దొంగ బ్యాంకు ఎకౌంటు జత పరిచి మొత్తం సొమ్ము లాగేసారు అనేది అభియోగం. అయితే మోస పోయిన వారి గురించి తెలుసుకొని భూసేకరణ కార్యాలయం వారు మోసం చేసిన వారికీ నోటీసులు పంపించినరు, అ దొంగ సన్నాసులు సమాధానం కూడా తెలియ చెయ్యటం లేదు అనేది వాస్తవం.
ఒక భూమి యజమాని డబ్బు వేరొకరి ఖాతా లో ఎలాగా జమ అవుతుంది చెప్పండి. అంటే లోపల ఒక అవినీతి కుక్క ఉండి, భయట దళారి వేసిన ఎంగిలి మెతుకులకు ఆశ పడి చేసిన వెధవ పని అని చిన్న పిల్లాడిని అడిగిన చెప్పుతాడు. అసలు ఇంటిలో ఎంగిలి ఎరకు ఆశపడిన అవినీతి కుక్కను వదిలేసి భయట ఉన్న నక్కలకు నోటీసు లు పంపిస్తే ! వాడు కడతాడ !.
ముందల లోపల ఉన్న కుక్కలను పట్టుకుంటే వాటికీ మేత వేసిన చెయ్య , అందుకు ప్రణాళిక రచించిన బుర్ర, ప్రణాళికను అమలుపరిచినవారు అందరు ఉసలు లెక్క పెడతారు.
హరెంద్రియా ప్రసాద్ భూసేకరణ అధికారి ఒక ప్రముఖ పేపర్ కి ఇచ్చిన స్టేట్ మెంట్ లో అక్రమ పద్ధతి లో పరిహారం పొందినవారికి నోటీసులు జారి చేసాం అని చెప్పుతున్నారు, మరి పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వరు సర్ , తప్పుడు ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగిని మోసం చేసి లబ్ది పొందటం నేరమే కదా ! మీకేంటి సర్ కేవలం నోటీసులు జారి చేసి ఉరుకోవలిసిన స్పెషల్ ఇంట్రెస్ట్. అన్యాయం జరిగిన వారికీ న్యాయం జరిగితే తమంతట తామే వేత్తుకొని మీ వద్దకు వచ్చి ఫిర్యాదు అందిస్తారు.
Post by