ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

తూర్పు గోదావరి జిల్లా ఐ డి బి ఐ బ్యాంకు లో 394.59 కోట్ల అవకతవకలు - రైతుల పేరిట దొంగ ఋణాలు



       

తూర్పు గోదావరి జిల్లా రాజముండ్రి లో ఉన్న ఐ డి బి ఐ  బ్యాంకు లో రైతు ఋణాల పేరిట రూ.394.59 కోట్ల  అవకతవకలు జరిగాయి. ఇందులో అర్. దామోదరం చీఫ్ జనరల్ మేనేజర్, మొదటి ముద్దాయి  (A1),  బట్టు రామారావు  డిప్యూటీ జనరల్ మేనేజర్(రిటైర్డ్), రెండవ ముద్దాయి  (A2) విరి ఇద్దరు మరియు కొంతమంది బ్యాంకు ఉద్యోగులు , ఇంకొక 14 మంది ముద్దాయిలు దళారులగా వ్యవహరించిన  బడిగంట్ల శ్రీనివాసరావు , బండి నారయణరావు , గిడుగు సత్య నాగేంద్ర శ్రీనివాసరావు , గాంధీ కర్రి, మానేపల్లి సూర్య మాణిక్యం , మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, నేరెళ్ళ వెంకట రామమోహనరావు, అర్ వి చంద్రమౌళి ప్రసాద్, గోలుగురి రామ కృష్ణారెడ్డి, వనపల్లి నారయణరావు , వనపల్లి పల్లయ్య , ఎల్. టి .కల్ బి.కే.సాహూ, జి.వి.రమణ ( జయరాం సివిల్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ), పి వి కే శ్రీనివాసరాజు ల తో  కలిసి  బ్యాంకు నియమాలకు విరుద్దంగా  ఋణాలు మంజూరు చేసి బ్యాంకు కి ఐ డి బి ఐ బ్యాంకు కు 394.59 కోట్ల  నష్టం చేకూర్చారు అని ప్రఫుల్ల కుమార్ బెహెర , ఐ డి బి ఐ, విశాఖపట్నం (రీజినల్  ఆఫీస్ ) జనరల్ మేనేజర్ మరియు సీనియర్ హెడ్   వారు సి .బి. ఐ వారికీ ఫిర్యాదు అందించారు.

ఈ కేసు ని 27-03-2018 వ తేదిన సి .బి. ఐ వారు రిజిస్టర్ చేసి విచారణ చేపట్టారు.

వివరాలలోకి వెళ్ళితే బ్యాంకు నిభంధనల ప్రకారం  కిసాన్ క్రెడిట్ కార్డు  లోన్స్  యొక్క పరిమితి 25 లక్షలు మాత్రేమ, అయితే దామోదరం (మొదటి ముద్దాయి ) అ పరిమితి కి మించి 5 కోట్ల రూపాయలు లోన్ సేనక్షన్ చేసారు. అ విధముగా 350 మందికి లోన్స్ మంజూరు చెయ్యవలిసిందిగా , అ 350 మంది యొక్క రిపోర్ట్లు అనుకూలముగా రూపొందించవలసింది గా అధికారులని మొదటి ముద్దాయి మరియు రెండవ ముద్దాయి సూచించారు. అ సొమ్ముని లబ్ది దారుల యొక్క సేవింగ్స్ ఎకౌంటు లో డిపాజిట్ చేసి, అ సొమ్ము ఉపసంహరించే  వ్యవహారములో ఎటువంటి నిబంధనలు లేకుండా డిపాజిట్ చేసే విధముగా సూచించారు. అ సొమ్ము ని లబ్దిదారుడి ఎకౌంటు నుంచి దళారీల ఎకౌంటు కి మళ్ళించారు . అసలు మొదటి ముద్దాయి కి కేవలం బ్యాంకు కి  50 కి.మీ. దూరం వరుకు మరియు 25 లక్షల వారుకు మాత్రమే లోన్ సేనక్షన్ చేసే  పరిమితి ఉన్నది. కానీ 5 కోట్ల రూపాయలు  వరుకు సేనక్షన్ జరిగింది.

అసలు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ క్రింద చెరువులు నిర్మించడానికి లోన్ మంజూరు చేస్తారు. కానీ పైన తెలిపిన లోన్ విభాగం లో ఎటువంటి చెరువులు నిర్మించబడలేదు. విషయం అరా తీస్తే చివరిగా తేలిన భాగోతం ఇది.

ఎఫ్ ఐ అర్

తరువాత ఆర్టికల్ లో మరో బ్యాంకు స్కాం తో







 Post by

 Quickandhra Independent Web Media Publication


In Association with

Image

Advertisement