పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోట మండలం లో షేక్ మొహబూబ్ సుభాని అనే తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యుడు కొన్ని సంవత్యరలుగా
మరోటార్ న్యూరాన్ వ్యాధి తో కదలలేని పరిస్థితి లో ఉన్నారు. అయన కి చంద్రబాబు నాయుడు గారు అన్న , పార్టీ అన్న, విపరీతమైన అభిమానం, చంద్రబాబు నాయుడు గారిని స్వయంగ కలవాలి అనేది తన కోరిక అని అనే విషయం తెలుసుకున్న మాగంటి బాబు గారు
, గత నెల జిల్లాలోని పోగోండ రిజర్వాయర్ ప్రారంభోత్సవం లో ముఖ్యమంత్రి గారి వద్దకు స్వయంగా తీసుకుని వెళ్ళి తన పరిస్థితి వివరించగా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి, అభిమాని వద్దకే వెళ్ళి పలకరించి షేక్ మొహబూబ్ సుభాని గారిని మానసికంగా ధృడ పరిచారు.
కదలలేని తన అభిమాని యొక్క పరిస్థితి అర్ధం చేసుకొని, నేను ముఖ్యమంత్రి ని అని ఎటువంటి గర్వం లేకుండా
షేక్ మొహబూబ్ సుభాని గారి వద్దకు స్వయముగా వెళ్ళి పలకరించి, అ తరువాత వారికీ 20 లక్షల ఆర్ధిక సహాయం చేసారు .
స్వయంగా అయన తన అభిమాని వద్దకు వెళ్ళి ఒక ఆత్మీయత పలకరింపు ఇవ్వడం మరువలేని విషయం గా జెడ్ .పి.టి .సి ఘంట సుధీర్ బాబు గారు అయన ఫేస్ బుక్ ఎకౌంటు లో తెలియచేసారు, అలాగే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ ఒక్క విషయం లోనే కాదు, అయన సొంత ఉరిలో అయన సెక్యూరిటీ విషయంలో ఇబ్బంది పడిన స్థానికుడికి కూడ "సారీ " అని చెప్పటం లొ తను ప్రజల యొక్క మనోభావాలకి ఎంత విలువ ఇస్తున్నారు అనే విషయం అర్ధం అవుతుంది.